బీఆర్ శెట్టికి హైకోర్టులో చుక్కెదురు
ABN, First Publish Date - 2021-05-13T05:30:00+05:30
పారిశ్రామికవేత్త బీఆర్ శెట్టికి కర్ణాటక హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన యూఏఈకి వెళ్లకుండా హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది
బెంగళూరు(ఆంధ్రజ్యోతి) : పారిశ్రామికవేత్త బీఆర్ శెట్టికి కర్ణాటక హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన యూఏఈకి వెళ్లకుండా హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలను బుధవారం ఇద్దరు సభ్యుల ధర్మాసనం సమర్ధించింది. ప్రతి పౌరుడికి ప్రయాణించే హక్కుతో పాటు తీసుకున్న రుణాలు చెల్లించాల్సిన బాధ్యతా ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తమ నుంచి తీసుకున్న రూ.2,800 కోట్ల రుణాలను తీర్చకుండా శెట్టి విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ గతంలో ఫిర్యాదు చేశాయి.
Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST