వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు
ABN, First Publish Date - 2021-02-27T09:17:54+05:30
ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి అమలులో ఉన్న వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును ప్రభుత్వం పొడిగించింది. సీబీడీటీ ఈ అంశాన్ని ఒక ట్విట్టర్ సందేశంలో తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి అమలులో ఉన్న వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును ప్రభుత్వం పొడిగించింది. సీబీడీటీ ఈ అంశాన్ని ఒక ట్విట్టర్ సందేశంలో తెలిపింది. దీని ప్రకారం ఈ పథకం కింద స్వచ్ఛంద ప్రకటన చేయడానికి గడువును మార్చి 31 వరకు, అపరాధ రుసుము లేకుండా చెల్లింపులు చేయడానికి గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు.
Updated Date - 2021-02-27T09:17:54+05:30 IST