‘వాట్సాప్’కు పోటీ... కేంద్రం కొత్త మెసేజ్ యాప్ ‘ందేశ్’
ABN, First Publish Date - 2021-02-09T00:31:11+05:30
మెసేజింగ్ యాప్ వాట్సాప్కు ధీటుగా కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ని తీసుకురానుందా ? ఇందుకు ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
న్యూఢిల్లీ : మెసేజింగ్ యాప్ వాట్సాప్కు ధీటుగా కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ని తీసుకురానుందా ? ఇందుకు ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది. వివరాలిలా ఉన్నాయి. వాట్సాప్ తరహా ఫీచర్స్తో ఓ యాప్ను కేంద్రం త్వరలో లాంచ్ చేయనుంది. దీనికి ‘సందేశ్’ అనే పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం. సందేశ్ పేరుతో ఆవిష్కరించనున్న ఈ యాప్ టెస్టింగ్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిననట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ యాప్ను ప్రభుత్వాధికారులుఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరీక్షలో భాగంగా వీరు ఉపయోగిస్తున్నారు.
వాట్సాప్ వంటి యాప్ను ఆవిష్కరించే ఓ ప్రణాళికను ప్రభుత్వం గతేడాది ధృవీకరించిందని, జిమ్స్ పేరుతో ఈ ప్రభుత్వ యాప్ను లాంచ్ చేయనుందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే దేశీయంగా... ‘సందేశ్’ పేరుతో తీసుకురానుందని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలోనే దీనిని ఉపయోగానికి కూడా సిద్ధంగా ఉంచిందని సమాచారం. ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దీనిని ఉపయోగిస్తున్నారు. సమాచార మార్పిడికోసం ఇప్పటికే కొంతమంది ప్రభుత్వాధికారులు సందేశ్ యాప్ను ఉపయోగిస్తున్నారని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.
కాగా... ఓటీపీ ఆధారిత లాగిన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లతోపాటు ఆధునిక ఛాటింగ్ వంటి ఫీచర్లతో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫాంలకు అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బ్యాకెండ్ సపోర్టు అందిసుందని సమాచారం.
Updated Date - 2021-02-09T00:31:11+05:30 IST