ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ప్రభావం... జీడీపీ... 11 నుంచి 9.8 శాతానికి తగ్గింపు... ఎస్అండ్‌పీ

ABN, First Publish Date - 2021-05-06T02:05:43+05:30

దేశ ఆర్థికవ్యవస్థ రికవరీ సాధిస్తోన్న నేపధ్యంలో కరోనా సెకెండ్ వేవ్‌ కారణంగా మళ్ళీ మందగమనమేర్పడే ప్రమాదముందని గ్లోబల్ రేటింగ్ సంస్థ ‘ఎస్అండ్‌పీ’ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ ఆర్థికవ్యవస్థ రికవరీ సాధిస్తోన్న నేపధ్యంలో కరోనా సెకెండ్ వేవ్‌ కారణంగా మళ్ళీ మందగమనమేర్పడే ప్రమాదముందని గ్లోబల్ రేటింగ్ సంస్థ ‘ఎస్అండ్‌పీ’ పేర్కొంది. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాను 11 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.


ప్రస్తుత పరిస్థితుల్లో తమ జీడీపీ అంచనాల్లో సుమారు 1.2 శాతం కుదించుకుపోవచ్చని, ఈ క్రమంలో వృద్ధి రేటు 9.8 శాతానికి పరిమితమవుతుందని ఎస్అండ్‌పీ పేర్కొంది ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా జూన్ చివరి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఈ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. .


అంటే... ఈ ఏడాది తర్వాత రికవరీ పుంజుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ దేశంగా ఉన్నప్పటికీ... భారత్‌లో గ్రామీణ జనాభాకు టీకాలనందించడం అతిపెద్ద సవాలుగా మారనుందని అభిప్రాయపడింది. అంతిమంగా ఈ పరిణామాలన్నీ జీడీపీపై ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంది. 

Updated Date - 2021-05-06T02:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising