భారత్ బయోటెక్ ప్లాంట్కు బ్రెజిల్ రెగ్యులేటరీ ధ్రువీకరణ
ABN, First Publish Date - 2021-06-11T07:41:11+05:30
హైదరాబాద్లోని భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ తయారీ యూనిట్కు, వాక్సిన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్ (ఏపీఐ)కి బ్రెజిల్ రెగ్యులేటరీ అన్విసా జీఎంపీ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్లోని భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ తయారీ యూనిట్కు, వాక్సిన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్ (ఏపీఐ)కి బ్రెజిల్ రెగ్యులేటరీ అన్విసా జీఎంపీ (గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్) ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. ‘అసాధారణ దిగుమతుల’ ప్రాతిపదిక కింద 40 లక్షల కొవాగ్జిన్ దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన వారంలోపే జీఎంపీ ఽధ్రువీకరణ పత్రాలకు భారత్ బయోటెక్ చేసిన దరఖాస్తులను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది. సీబీపీఎఫ్ ధ్రువీకరణ పత్రం రెండేళ్లకు వర్తిస్తుంది. మార్చిలో హైదరాబాద్లోని ప్లాంట్ను సందర్శించిన అన్విసా.. తయారీ ప్రక్రియ తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవని కొన్ని మార్పులు చేయాలని సూచించిం ది. ఈ మార్పులు చేయడంతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది.
Updated Date - 2021-06-11T07:41:11+05:30 IST