ముగిసిన బయో ఏషియా
ABN, First Publish Date - 2021-02-24T08:21:12+05:30
రెండురోజుల పాటు జరిగిన బయో ఏషియా 2021 సదస్సు మంగళవారం సాయంత్రం ముగిసింది. వర్చువల్గా జరిగిన ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 31,450 మంది ప్రతినిధులు హాజరయ్యారు...
- ఐసీఎంఆర్ డీజీ బల్రామ్ భార్గవ్కు
- ఎఫ్ఏబీఏ స్పెషల్ అవార్డు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రెండురోజుల పాటు జరిగిన బయో ఏషియా 2021 సదస్సు మంగళవారం సాయంత్రం ముగిసింది. వర్చువల్గా జరిగిన ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 31,450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన 60 వక్తలు ప్రసంగించారు. కొవిడ్-19 తర్వా త తలెత్తిన సవాళ్లు, అవకాశాలు, లైఫ్ సైన్సెస్ రంగం నేర్చుకున్న పాఠాలు మొదలైన వాటిపై చర్చ జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ (ఎఫ్ఏబీఏ) స్పెషల్ అవార్డును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్, కేంద్ర హెల్త్ రీసెర్చ్ విభాగం సెక్రటరీ బల్రామ్ భార్గవ్కు ప్రదానం చేశారు. కొవిడ్-19పై అరికట్టడానికి భారత్లో ఆయన చేసిన కృషి.. ఇండియా-స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ ప్రొగ్రామ్, స్టెమ్సెల్పై అధ్యయనానికి సీ-జీఎంపీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రం ఏర్పాటు వంటి అనేక సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
Updated Date - 2021-02-24T08:21:12+05:30 IST