ఈ కార్లపై నెలాఖరు వరకు భారీ తగ్గింపు...
ABN, First Publish Date - 2021-04-22T22:41:01+05:30
కార్ల కొనుగోలుదారులకు ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరోసారి తీపి కబురు చెప్పింది.
ముంబై : కార్ల కొనుగోలుదారులకు ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరోసారి తీపి కబురు చెప్పింది. ఇటీవల లాంచ్ చేసిను థార్ మినహా అన్ని కార్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. బీఎస్-6 కార్లను భారీ డిస్కౌంట్ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అఫర్లో దాదాపు రూ. 3.06 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలనందిస్తోంది.
ఈ డిస్కౌంట్ రేట్లు ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆయా డీలర్ల పరిధిలో ఈ తగ్గింపులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు కెయూవీ 100 ఎన్ఎక్స్టీ నుండి అల్టురాస్ జీ 4 ఫ్లాగ్షిప్ ఎస్యూవీ వరకు పలు మోడళ్ల కార్లపై నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రత్యేకించి అల్టురాస్ జీ 4 ఎస్యూవీ కొనుగోలుపై మొత్తం రూ. 3.06 లక్షల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో
రూ. 2.2 లక్షల వరకు నగదు ఆఫర్, రూ. 50 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. కార్పొరేట్ ఆఫర్ , ఇతర ప్రయోజనాలు వరుసగా రూ. 16 వేలు, రూ. 20 వేలు అందుబాటులో ఉంటాయి.
మరాజ్జో ఎంపీవీలో అందించే గరిష్ట తగ్గింపు రూ. 41 వేలు. ఇందులో రూ. 20 వేల వరకు నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 15 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 6 వేల వరకు లభిస్తాయి.
Updated Date - 2021-04-22T22:41:01+05:30 IST