ఉత్పత్తి పెంపుపై ‘ఆటో’ ఫోకస్
ABN, First Publish Date - 2021-06-21T08:46:31+05:30
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టా యి. కరోనా పూర్తిగా తగ్గే సమయానికి ఏర్పడే డిమాండును తట్టుకునేందుకు ఉత్పత్తి పెంచడం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టా యి. కరోనా పూర్తిగా తగ్గే సమయానికి ఏర్పడే డిమాండును తట్టుకునేందుకు ఉత్పత్తి పెంచడం తప్పనిసరి అని కంపెనీలు భావిస్తున్నాయి. క్రమంగా లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ ఉండడంతో ఉత్పత్తి పెంపునకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు టాటా మోటా ర్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఏర్పడడం ఉత్పత్తి పెంపునకు అవరోధం కావచ్చన్నారు. డిమాండు, సరఫరా స్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు మహీంద్రా (ఆటోమోటివ్ డివిజన్) సీఈఓ విజయ్ నక్రా చెప్పారు.
Updated Date - 2021-06-21T08:46:31+05:30 IST