ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లతో ప్రతిరోజూ ఉచిత డేటా!

ABN, First Publish Date - 2021-11-29T01:07:57+05:30

ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచి ఖాతాదారులకు షాకిచ్చిన ప్రముఖ టెలికం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచి ఖాతాదారులకు షాకిచ్చిన ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటాను ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. రూ. 265, రూ. 299, రూ.719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవల ప్రీపెయిడ్ ప్యాక్ ధరలను పెంచిన ఎయిర్‌టెల్ మరింత టాక్‌టైమ్, మరింత డేటా అందిస్తామని అప్పట్లో పేర్కొంది. 


ఎయిర్‌టెల్ తాజాగా ప్రకటించిన ఆఫర్ అన్ని ప్లాన్లకు వర్తించదు. ఇక, రూ. 265 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా 28 రోజులపాటు లభిస్తుండగా, రూ. 839 ప్లాన్‌లో 84 రోజుల కాలపరిమితితో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే ప్రతి రోజు అదనంగా 500 ఎంబీ డేటా లభిస్తుంది. 


అదనపు డేటా ఆఫర్ ప్లాన్ కాలపరిమితి ఉన్నంత వరకే ఉంటుంది. ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ ఆఫర్ కూడా ముగిసిపోతుంది. అదనపు డేటాకు రోల్ ఓవర్ సౌలభ్యం ఉండదని ఎయిర్‌టెల్ తెలిపింది. కాగా, ఈ అదనపు డేటా ఆఫర్ ఎంతకాలం ఉంటుందనే వివరాలను మాత్రం ఎయిర్‌టెల్ వెల్లడించలేదు. 

Updated Date - 2021-11-29T01:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising