అమల్లోకొచ్చిన ‘24 గంటల నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హైస్ సర్వీస్’లు
ABN, First Publish Date - 2021-08-01T21:24:05+05:30
ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిబంధనలను సవరించింది. ఈ’ క్రమంలో... ఈ రోజు(ఆదివారం) నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హైస్ సర్వీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండనున్నాయి.
ముంబై : ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిబంధనలను సవరించింది. ఈ’ క్రమంలో... ఈ రోజు(ఆదివారం) నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హైస్ సర్వీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండనున్నాయి. ఈ నేపధ్యంలో... వేతనాలు, పింఛన్లు, సబ్సిడీల చెల్లింపులు తదితర ప్రయోజనాలు ఖచ్చితమైన తేదీనే అందుతాయి. ఇవ్వన్నీ ఈ రోజు నుంచి ఖచ్చితమైన సమయానికే బ్ధిదారులకు అందనున్నాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
ఆర్బీఐ ఆదేశాలు ఈ రోజు నుంచి అమలుల్లోకి వచ్చాయి. అంటే ఆగస్టు ఒకటి నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలు మారాయి. ఈ సేవలు ఇక నిత్యం అందుబాటులో ఉంటాయి.
సాధారణంగా ఆదివారం సహా ఇతరత్రా బ్యాంక్ సెలవుల వంటివి వస్తే.... ఆ రోజున వేతనాలు, పింఛన్లు అందబోవన్న విషయం తెలిసిందే. కొన్ని కంపెనీలు... ముందుగానే వేతనాలను చెల్తిస్తుండగా, మరికొన్ని సంస్థలు... తర్వాతి పనిదినం రోజున చెల్లింపులు జరుపుతుంటాయి. పెన్షన్లకు కూడా ఇదే వర్తిస్తుంది. కాగా... రేపటి నుంచి ‘సెలవు’తో నిమిత్తం లేకుండా వేతనాలు, పెన్షన్, డివిడెంట్ వంటి వాటిని అదే రోజున పొందవచ్చు.
Updated Date - 2021-08-01T21:24:05+05:30 IST