YSRCP ఎమ్మెల్యే ఇంట విషాదం..
ABN, First Publish Date - 2021-12-31T12:27:35+05:30
YSRCP ఎమ్మెల్యే ఇంట విషాదం..
చిత్తూరు జిల్లా /వాల్మీకిపురం : ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ శివానంద రెడ్డి తల్లి చింతల నిర్మలమ్మ(79) గురువారం నాడు మృతిచెందారు. ఆమె మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఏపీఎండీసీ డైరెక్టర్ హరీష్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు బరకం రవికుమార్రెడ్డి, గిరిధర్రెడ్డి, జడ్పీ కో -ఆప్షన్ సభ్యుడు షామియానా షఫీ, పీలేరు సర్పంచ్ హబీబ్బాషా, వివేకానందరెడ్డి, సూర్యారెడ్డి, వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, అధికారులు హాజరై నిర్మలమ్మ మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం సాయంత్రం నిర్మలమ్మకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Updated Date - 2021-12-31T12:27:35+05:30 IST