YSRCP MLA బియ్యపు మధు దాతృత్వం..
ABN, First Publish Date - 2021-08-24T12:22:57+05:30
ఆయన కుమార్తె పవిత్రారెడ్డి... జిలానీ భార్యకు...
చిత్తూరు జిల్లా/శ్రీకాళహస్తి : కరోనాతో మృతిచెందిన ఓ పండ్ల వ్యాపారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరా లివీ.. పట్టణానికి చెందిన జిలానీ ఎమ్మెల్యే మధు కార్యాలయ సమీపంలో పండ్ల దుకాణం నిర్వహిస్తుంటారు. ఆ మార్గంలో నిత్యం వెళ్లే ఎమ్మెల్యే కారు ఆపి, అభిమానంతో ఆయనకు పండ్లు ఉచితంగా ఇచ్చేవారు. విధి చిన్నచూపు చూడటంతో ఇటీవల జిలానీ కరోనాతో మృతిచెందారు. దీంతో సోమవారం ఆయన భార్య, ఇద్దరు బిడ్డలతో వచ్చి ఎమ్మెల్యేను కలిసారు. తమకు పూట గడవటం కష్టంగా మారిందని వాపోయారు. స్పందించిన మధు, ఆయన కుమార్తె పవిత్రారెడ్డి... జిలానీ భార్యకు ఉపాధి కల్పిస్తామనీ, పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీఇచ్చారు.
Updated Date - 2021-08-24T12:22:57+05:30 IST