ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిపోతామనే భయంతోనే దాడులు: యరపతినేని

ABN, First Publish Date - 2021-04-13T19:56:22+05:30

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం విద్యానగర్ కార్యాలయంలో యరపతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా యరపతినేని మాట్లాడుతూ.. టీడీపీకి వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన సంఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే గేట్లు మూసేశారని మండిపడ్డారు. వీరి అహంకారం దించే రోజు దగ్గర్లో ఉందని హెచ్చరించారు. తిరుపతిలో ఒడిపోతామనే భయంతో వైసీపీ దాడులు చేస్తుందన్నారు. బాబుపై దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. రాష్టంలో ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబుపై జరిగిన దాడిని ఖండించాలని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2021-04-13T19:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising