రాజ్యసభలో వైసీపీ ఎంపీల ఆందోళన
ABN, First Publish Date - 2021-07-20T21:06:03+05:30
రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ...
న్యూఢిల్లీ: రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైన వెంటనే మళ్లీ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం కావాలంటూ పొడియం వద్దకు దూసుకువెళ్లారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీ అంశంపై చర్చ జరపాలని కోరుతూ రాజ్యసభలో మంగళవారం రెండో రోజు వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. దాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. దీంతో ప్లకార్డ్ పట్టుకుని విజయసాయి రెడ్డి పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభను గంటపాటు వాయిదా వేశారు.
రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విజయసాయి రెడ్డితోపాటు ప్రతిపక్ష సభ్యులు రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ రూల్ 267 కింద 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని. అందులో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు తాను చర్చకు అనుమంతించలేనని అన్నారు. దీంతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీ కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమేనని, దీనిపై చర్చకు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఛైర్మన్ మాట్లాడుతూ ‘దీనిపై వాదన వద్దని, ఈ అంశం (ప్రత్యేక హోదా) మీకు (రాష్ట్ర ప్రభుత్వం) కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని’ అన్నారు. చైర్మన్ సమాధానంపై సంతృప్తి చెందని విజయసాయి ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద ప్రదర్శిస్తూ నిలబడ్డారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్ సభను గంటపాటు వాయిదా వేశారు.
Updated Date - 2021-07-20T21:06:03+05:30 IST