ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబు చేసిన పాపం వల్లే తిరుపతికి ఈ గతి: Bhumana

ABN, First Publish Date - 2021-11-23T19:08:17+05:30

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన పాపం వలనే తిరుపతికి ఈ గతి పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన పాపం వలనే తిరుపతికి ఈ గతి పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో చెరువులు ఆక్రమణకు గురైందని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సెంటు కూడా భూ కబ్జా జరగలేదని తెలిపారు. హుడ్ హుడ్, తిట్లీ తుఫాన్ చంద్రబాబు హయాంలో వచ్చాయని.. చంద్రబాబు ఏ బాధితుడికి సహాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించారన్నారు. చంద్రబాబు ప్రచారాలకే పరిమితం అయ్యారని, ఫోటోలకు ఫోజులు ఇస్తారే తప్ప బాధితులకు ఒక రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. పుష్కరాల సమయంలో నలభై మంది అమాయక ప్రజలు బలైయ్యారని.. ఇందుకు కారణం చంద్రబాబే అని ఆరోపించారు. వరద బాధిత కుటుంబానికి రూ.2 వేలు ఆర్థిక సాయం, మూడు కోట్ల విలువైన నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తిరుపతిలో డ్రైనేజీ వ్యవస్థ బాగు కోసం రూ.189 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారన్నారు. చంద్రబాబు తిరుపతికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-23T19:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising