ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఉందా?

ABN, First Publish Date - 2021-10-22T01:19:37+05:30

ఏపీ టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పరిస్థితులు వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయాయి. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. తమపై దాడి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. తమ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిని మాత్రం ఇప్పటివరకూ గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 



ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఉందా?. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని వైసీపీ ఎందుకంటోంది?. చంద్రబాబు ఏ ప్రయోజనాల కోసం నిరసన దీక్ష చేస్తున్నారు?. మూక దాడులు చేసిన వైసీపీ పోటీ దీక్షలు ఎందుకు చేస్తోంది.?. పట్టాభిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం దాడి చేసిన దుండగులను పట్టుకుందా?.’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-10-22T01:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising