పుత్తూరు మున్సిపాలిటీపై వైసీపీ జెండా
ABN, First Publish Date - 2021-03-14T22:18:02+05:30
పుత్తూరు మున్సిపాలిటీలో వైసీపీ ఘన విజయం సాధించింది.
తిరుపతి: పుత్తూరు మున్సిపాలిటీలో వైసీపీ ఘన విజయం సాధించింది. మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగురనుంది. మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులు ఉన్నాయి. వీటిలో 1 స్థానాన్ని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 21 వార్డులలో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 22 స్థానాలలో వైసీపీ జెండా ఎగురవేసింది. కేవలం 5 స్థానాలలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. జనసేన, బీజేపీలు పత్తా లేకుండా పోయాయి.
Updated Date - 2021-03-14T22:18:02+05:30 IST