మూడు ముక్కలాట మాదే.. జగన్ని ఇరికిస్తున్న మంత్రులు
ABN, First Publish Date - 2021-12-17T01:03:43+05:30
మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ....
అమరావతి/హైదరాబాద్: మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో రైతుల పేరిట సోమవారం జరగబోయేది రాజకీయ సభ అన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడమే టీడీపీ లక్ష్యమన్నారు. అమరావతే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పారు.పాదయాత్రలో పాల్గొన్నది టీడీపీ వాళ్లేనన్నారు. ప్రాంతీయ అసమానతలు ఉండొద్దనే మూడు రాజధానులను చేస్తున్నామన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. టీడీపీకి ఆ 29 గ్రామాలు, సామాజికవర్గమే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ‘‘రాజధాని ఉద్యమం తెలుగుదేశం ఉద్యమం అని వైసీపీ ఎందుకంటోంది?. మరి అర్థం పర్థం లేని మూడు రాజధానులు వైసీపీ సొంత ఎజెండా కాదా?. పచ్చి అబద్ధాలతో మూడు ముక్కలాట ఆడుతున్న వైసీపీని ఏమనాలి?. రాష్ట్ర బంగారు భవిష్యత్తుపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జగన్ విచ్ఛిన్నకర ఆలోచన చేస్తారా?. పదవుల కోసం జగన్కు వంత పాడుతున్న నేతలకు ప్రజల ఆగ్రహం కనిపించదా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.
Updated Date - 2021-12-17T01:03:43+05:30 IST