వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం?
ABN, First Publish Date - 2021-12-08T01:54:28+05:30
అధికారుల, నాయకుల వేధింపులను భరించలేక ఓ మహిళ
నెల్లూరు: అధికారుల, నాయకుల వేధింపులను భరించలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాకకు చెందిన వాణి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పొలం వివాదంలో వైసీపీ నేతల, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. జలదంకి పీఎస్లో ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-12-08T01:54:28+05:30 IST