West Godavari: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన తల్లి, కుమారులు అదృశ్యం
ABN, First Publish Date - 2021-10-31T13:44:44+05:30
ఏలూరులో పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. జులై 8వ తేదీన ఏలూరు వచ్చిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఆత్కూరుకు చెందిన చల్లగొళ్ళ నాగలక్ష్మి
పశ్చిమ గోదావరి: ఏలూరులో పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. జులై 8వ తేదీన ఏలూరు వచ్చిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఆత్కూరుకు చెందిన చల్లగొళ్ళ నాగలక్ష్మి (30), కుమారులు..చక్రధర్ (6), హేమంత్ శ్రీసాయి (4)లు అదృశ్యమయ్యారు. పుట్టిన రోజు వేడుక నుంచి అమ్మగారింటికి వెళ్తున్నాని భర్తకు నాగలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది. జులై 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆచూకీ దొరకకపోవడంతో భర్త సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-31T13:44:44+05:30 IST