పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి.. వైసీపీకి 11, టీడీపీకి 1
ABN, First Publish Date - 2021-07-25T17:07:07+05:30
వైసీపీ - 11 బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఒక్కో టేబుల్పై
ఏలూరు : ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. డివిజన్ల వారీ లెక్కింపు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియాకు వెల్లడించారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఒక్కో టేబుల్పై ఒక్కో డివిజన్ ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తున్నామని కలెక్టర్ మీడియాకు వెల్లడించారు.
ఎవరికెన్ని..!?
వైసీపీ - 11
చెల్లనివి - 02
నోటా - 01
టీడీపీ - 01
కాగా.. కాసేపట్లో ఎనిమిది డివిజన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. 2, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లకు ఫైనల్ కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 47 డివిజన్లకు కౌంటింగ్ ప్రస్తుతం జరుగుతోందని అధికారులు వెల్లడించారు.
Updated Date - 2021-07-25T17:07:07+05:30 IST