ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవ దర్శనానికి వెళుతున్న భార్యభర్తలు మృతి

ABN, First Publish Date - 2021-04-11T05:11:35+05:30

జాతీయ రహదారిపై అన్నవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పెరవలి, ఏప్రిల్‌ 10: జాతీయ  రహదారిపై అన్నవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. గణపవరం మండలం ఎస్‌.కొండేపాడుకు చెందిన మొకమట్ల నర్శింహరావు (47) పెయింటింగ్‌ పనిచేస్తాడు. భార్య వెంకటలక్ష్మి (42)తో కలిసి మోటారు సైకిల్‌పై తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు. అన్నవరప్పాడు వద్ద రావులపాలెం వైపు వెళుతున్న కారు వారి మోటార్‌ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య భర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ సూర్యభగవాన్‌ తెలిపారు. వారికి ఇద్దరు కుమారు కాగా ఇద్దరికీ వివాహాల య్యాయి. వాడపల్లి ఆలయంలో ఏడు వారాలు పూజలు చేయలని వారు మొక్కు కున్నారు.  ఆఖరి వారం ఆలయానికి వెళుతుండగా ప్రమాదంలో మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-04-11T05:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising