మునిసిపల్ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు
ABN, First Publish Date - 2021-03-01T05:23:31+05:30
మునిసిపల్ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్లు కె.వెంకట రమణారెడ్డి, హిమాన్షు శుక్లాలు తెలి పారు.
ఎస్ఈసీకి జేసీల వివరణ
ఏలూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్లు కె.వెంకట రమణారెడ్డి, హిమాన్షు శుక్లాలు తెలి పారు. ఆదివారం విజయవాడ ఎస్ఈసీ కార్యాలయం నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు వీరిరువురు హాజరయ్యారు. జేసీ తేజ్ భరత్ ఏలూరు నుంచి వీసీలో పాల్గొన్నారు. జేసీ వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సక్రమంగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టామని ఎస్ఈసీకి చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను ఆయనకు జేసీ వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో రాజీ లేకుండా కఠినంగా అమలు చేయాలన్నారు. వీసీలో డీఆర్వో శ్రీని వాసమూర్తి, ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు, సెబ్ ఎస్పీ జయ రామరాజు, ఆర్డీవోలు పనబాక రచన, లక్ష్మారెడ్డి, ప్రసన్న లక్ష్మి, డీఎస్పీలు దిలీప్ కిరణ్, బి.శ్రీకాంత్, వీరాంజనేయ రెడ్డి, రవి కిరణ్, కె.ప్రభాకర్, ఎస్డీపీవో లతా కుమారి, డీసీవో వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-01T05:23:31+05:30 IST