ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వలాభం కోసమే సీఎంపై ఎంపీ ఆరోపణలు

ABN, First Publish Date - 2021-05-17T05:10:23+05:30

స్వలాభం కోసమే రఘురామకృష్ణంరాజు ప్రభు త్వంపై, ముఖ్యమంత్రిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని క్షత్రియ సమాఖ్య నాయ కులు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 క్షత్రియ పరిషత్‌ సమావేశంలో పెద్దలు

భీమవరం, మే 16 : స్వలాభం కోసమే రఘురామకృష్ణంరాజు ప్రభు త్వంపై, ముఖ్యమంత్రిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని క్షత్రియ సమాఖ్య నాయ కులు ప్రకటించారు. ఆదివారం భీమవరంలో ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వ్యతిరేకంగా నాలుగు అసెంబ్లీలకు చెందిన క్షత్రియ సమాఖ్య పెద్దలు కొందరు సమావేశమయ్యారు. వీరు మాట్లాడుతూ జగన్‌ క్షత్రియులపై ఉన్న గౌరవంతో నరసాపురం ఎంపీ నియోజకవర్గంలో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీటు ఇచ్చారన్నారు. వైసీపీ గుర్తుపై గెలిచిన రఘురామకృష్ణంరాజు వైసీపీపై, జగన్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. గడిచిన 14 నెలల్లో ఒక్కసారి కూడా రఘు రామరాజు తన నియోజకవర్గానికి రాకుండా హైదరాబాద్‌, ఢిల్లీలోనే మకాం పెట్టి రోజుకో కులాన్ని దూషిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసే ఎవ్వరికీ  సపోర్ట్‌ చేయమని ప్రకటించారు. ఎంపీ బంధువులైన క్షత్రియులు మాత్రమే ఆయనకు సపోర్ట్‌గా ఉన్నారన్నారు. సమావేశంలో భీమవరం క్షత్రియ సేవాసమితి అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు, కోశాధికారి చెరుకూరి నరసింహ రాజు, పాలకొల్లు క్షత్రియ సేవాసమితి సభ్యులు పెద్దిరాజు, గణపవరం క్షత్రియ సేవా సమితి సెక్రటరీ నడింపల్లి సోమరాజు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T05:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising