AP: ద్వారకా తిరుమలలో ఘనంగా ‘ధర్మపథం’
ABN, First Publish Date - 2021-10-10T19:06:54+05:30
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో శ్రీవారి కళాతోరణం వేదికపై ధర్మపథం కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో శ్రీవారి కళాతోరణం వేదికపై ధర్మపథం కార్యక్రమం ఘనంగా జరిగింది. జగ్గయ్యపేటకు చెందిన సూర్య యోగ ఫౌండేషన్ నిర్వహించిన ధర్మపథం కార్యక్రమం ద్వారా యోగాసనాలు, సూర్య నమస్కారాలు యోగ నిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య యోగ ఫౌండేషన్ సభ్యులు యోగాసనాలు ఎలా వేయాలో చూపించారు. యోగాసనాల ద్వారా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం సాంస్కృతిక కళ, ఆరోగ్య వేదిక వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మపథం కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఏఈవో మెట్టపల్లి దుర్గారావు దగ్గరుండి పర్యవేక్షించారు.
Updated Date - 2021-10-10T19:06:54+05:30 IST