ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారాల కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2021-01-22T05:41:16+05:30

షెడ్యూల్‌ కులాలు, తెగల అత్యాచారాల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, జనవరి 21 : షెడ్యూల్‌ కులాలు, తెగల అత్యాచారాల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు. తన కార్యాలయం నుంచి  పశ్చిమ, కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్సులో నిర్వహించారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల విచారణ వేగవంతం చేసి, నిందితులను త్వరితగతిన అరెస్ట్‌ చేయా లని ఆదేశించారు. కేసు దర్యాప్తు సమయంలో పాటించాల్సి నిబంధనలను పాటించాలన్నారు. ఛార్జిషీట్లను సకాలంలో కోర్టుకు సమర్పించాలన్నారు. మైనర్లపై, మహిళలపై దాడు లు చేసే వారిని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏలూరు ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎ.శ్రీని వాసరావు, నర్సాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, కృష్ణా జిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, గుడివాడ డీఎస్పీ సత్యానందం, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, చింతూరు డీఎస్పీ ఖాదర్‌ బాషాలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising