యోగాసనాలు వేస్తున్న కరోనా రోగులు
ABN, First Publish Date - 2021-05-13T15:30:29+05:30
కరోనా బారిన పడిన వారిని మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఉంచేందుకు వైద్యులు తగు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏలూరు: కరోనా బారిన పడిన వారిని మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఉంచేందుకు వైద్యులు తగు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కరోనా రోగులు యోగాసనాలు వేస్తున్నారు. టిడ్కో హౌసెస్ క్వారంటైన్ సెంటర్లో కరోనా రోగులు చేత వైద్యులు యోగా, వ్యాయామం చేయిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి ఒక గంట పాటు సూర్యరశ్మిలో వ్యాయామంలో శిక్షణ ఇస్తూ వారిలో మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
Updated Date - 2021-05-13T15:30:29+05:30 IST