వల్లభనేని వంశీపై పాతూరి రామ్ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2021-10-24T17:19:47+05:30
మ్మెల్యే వల్లభనేని వంశీపై నరసాపురం పార్లమెంట్ తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏలూరు: ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నరసాపురం పార్లమెంట్ తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంశీ నీ తీరు మార్చకో అని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ ఆడబిడ్డను వీధుల్లో పెట్టావని మండిపడ్డారు. ‘‘అన్ని కులాల్లో ఉన్న అన్న ఎన్టీఆర్ అభిమానులు నీ రాజకీయ పతానాన్ని చూస్తారు ఖబడ్దార్. క్షమాపణలు చెప్పి తప్పు దిద్దుకో...చరిత్రలో మిగిలిపోతావు...లేకపోతే కాలగర్బంలో కలిసిపోతావు’’ అని రామ్ప్రసాద్ హెచ్చరించారు.
Updated Date - 2021-10-24T17:19:47+05:30 IST