ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ద్వారకా తిరమల ఈవో నివాసం వద్ద ఇద్దరు వ్యక్తుల ఆందోళన

ABN, First Publish Date - 2021-12-31T13:58:27+05:30

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు ఆందోళన చేపట్టారు. ఈవోని కలవాలంటూ సెక్యూరిటీ సిబ్బందితో విజయవాడకు చెందిన లక్ష్మణరావు, శివాజీ అనే ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. గతంలో శివాజీతో పాటు మరో ముగ్గురు తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివాజీ కేసు విషయాన్ని ఈవోతో మాట్లాడటానికి వచ్చామని లక్ష్మణరావు చెబుతున్నారు. తమను చూసి ఈవో భయపడి దాక్కున్నాడని  ఆరోపించారు. ద్వారకా తిరుమల ఈఓ పోస్ట్ కోసం శివాజీ తదితరులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు  ఇవ్వకుండా ఈవో ముఖం చాటేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈవో వ్యక్తిగత వ్యవహారాలతో ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-31T13:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising