ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

90 శాతం వెదజల్లే విధానంలో వరి సాగు

ABN, First Publish Date - 2021-02-07T05:13:54+05:30

జిల్లాలో 90 శాతం పైగా నేరుగా వెదజల్లే వరి విధానం కొనసాగుతోందని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచా లకుడు జె.ప్రసాద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ సంయుక్త సంచాలకుడు ప్రసాద్‌

పెనుమంట్ర, ఫిబ్రవరి 6 : జిల్లాలో 90 శాతం పైగా నేరుగా వెదజల్లే వరి విధానం  కొనసాగుతోందని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచా లకుడు జె.ప్రసాద్‌ అన్నారు. మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం ఉభయగోదావరి జిల్లాల్లోని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షించారు. ఈ ఏడాది ఎంటీయూ 1121 రకం 75 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారన్నారు. జేడీ గౌసియాబేగం మాట్లా డుతూ జిల్లాలో 95 శాతం పైగా ఎంటీయూ 1121 వరి రకం సాగువుతుందని  తెలిపారు. జిల్లాలో ఎక్కువ ప్రాంతంలో జింక్‌ లోపం కనిపిస్తోందని తెలిపారు.  వ్యవసాయాధికారులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన శాస్త్రవేత్త సి.వెంకటరెడ్డి, డాక్టర్‌ పి.రమేష్‌బాబు, భువనేశ్వరి, మానుకొండ శ్రీనివాస్‌, ఎం.నంద కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T05:13:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising