ఏప్రిల్, మే నెలల్లో నిర్వాసితులను తరలిస్తాం
ABN, First Publish Date - 2021-02-27T05:30:00+05:30
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 41.15 కాంటూర్ లెవల్లో ముంపునకు గురవుతున్న 25 గ్రామాల ప్రజలను ఏప్రిల్, మే నెలల్లో పునరావాస కాలనీలకు తరలిస్తామని ఐటీడీఏ పీవో కె.సూర్యనారాయణ తెలిపారు.
కుక్కునూరు, ఫిబ్రవరి 27: కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 41.15 కాంటూర్ లెవల్లో ముంపునకు గురవుతున్న 25 గ్రామాల ప్రజలను ఏప్రిల్, మే నెలల్లో పునరావాస కాలనీలకు తరలిస్తామని ఐటీడీఏ పీవో కె.సూర్యనారాయణ తెలిపారు. శనివారం కుక్కునూరు ఆర్డీవో కార్యాల యంలో ఆయన మాట్లాడారు. తరలించే గ్రామాలకు త్వరలో అధికారులు వస్తారని వారి ముందు నిర్వాసితులు తమ సమస్యలను విన్నవించుకో వచ్చన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇళ్ల పరిహారం, వ్యక్తిగత పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.
Updated Date - 2021-02-27T05:30:00+05:30 IST