ఉద్యాన వర్శిటీ ఆవరణలో వాతావరణ కేంద్రం
ABN, First Publish Date - 2021-03-03T05:47:44+05:30
ఉద్యాన విశ్వవిద్యాలయ ఆవరణలో వాతా వరణ సమాచార కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అవసరమైన సమాచారం అందించేందుకు దోహదపడుతుందని ఉప కులపతి డాక్టర్ టి.జానకీ రామ్ పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 2: ఉద్యాన విశ్వవిద్యాలయ ఆవరణలో వాతా వరణ సమాచార కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అవసరమైన సమాచారం అందించేందుకు దోహదపడుతుందని ఉప కులపతి డాక్టర్ టి.జానకీ రామ్ పేర్కొన్నారు. తాడేపలి ్లగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో భారత వాతావరణశాఖ సమన్వయంతో, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సహ కారంతో ఏర్పాటుచేసిన వెదర్ స్టేషన్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎయిర్ టెంపరేచర్, సన్షైన్ సెన్సార్, వర్షపాతం, గాలి దిశ, మట్టి సాంద్రత, ఉష్ణోగ్రత వంటి వివరాలు తెలుసుకోవచ్చ న్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.శ్రీనివాసులు, లైబ్రేరియన్ డాక్టర్ డి.వెం కటస్వామి, కేవికే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-03T05:47:44+05:30 IST