వశిష్ఠకు వరద పోటు
ABN, First Publish Date - 2021-07-27T05:40:29+05:30
వశిష్ఠ గోదావరికి వరద తాకింది. ఎగువ నుంచి 2లక్షల క్యూసెక్టుల నీరు చేరడంతో నరసాపురం వద్ద గోదావరి పరవళ్లు తొక్కతుంది.
నిలిచిన పడవలు, పంటు రాకపోకలు
నరసాపురం/ఆచంట, జూలై 26: వశిష్ఠ గోదావరికి వరద తాకింది. ఎగువ నుంచి 2లక్షల క్యూసెక్టుల నీరు చేరడంతో నరసాపురం వద్ద గోదావరి పరవళ్లు తొక్కతుంది. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నదిలో పడవలు, పంటు రాకపోకల్ని నిలిపివేశారు. సోమవారం నరసాపురం– సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఆచంట మండలంలో రెండురోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద గోదావరి సోమవారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టింది. మండలంలోని ఆయా పుష్కర్ ఘాట్లలో సుమారు ఒక అడుగు మేర గోదావరి తగ్గింది. తీర ప్రాంత ప్రజలు, లంక వాసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Updated Date - 2021-07-27T05:40:29+05:30 IST