సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణ మహోత్సవాలు
ABN, First Publish Date - 2021-12-07T04:49:06+05:30
శ్రీవారి క్షేత్ర ఉపాలయం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
ద్వారకాతిరుమల, డిసెంబరు 6: శ్రీవారి క్షేత్ర ఉపాలయం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం సుబ్రహ్మణ్యేశ్వరుడిని పెండ్లి కుమారుడిగా, వల్లీదేవసేన అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ఈవో జీవీ.సుబ్బారెడ్డి పూజాదికాలు నిర్వహించారు.
Updated Date - 2021-12-07T04:49:06+05:30 IST