వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2021-10-15T05:26:53+05:30
మండలంలో గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.
పాలకోడేరు, అక్టోబరు 14: మండలంలో గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. గొల్లలకోడేరులో సైకిల్ వెళుతున్న వృద్ధు డిని వెనక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గొల్లల కోడేరుకు చెందిన పిల్లి శ్రీరాములు (90) పిల్లి శ్రీరాములు బాలాజీ టింబర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న మనవడు శ్రీనివాస్ వద్దకు సైకిల్పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. మనవడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేశారు. విస్సాకోడేరు వద్ద వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఆచంట లక్ష్మణ రావు (38) మృతి చెందాడు. లక్ష్మణరావు భీమవరం సెంట్ మేరీస్ స్కూల్లో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం మోటార్సైకిల్పై ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-15T05:26:53+05:30 IST