ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు ఇళ్లు ఇచ్చేది ఎప్పుడు?

ABN, First Publish Date - 2021-08-24T00:58:23+05:30

రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు ఇచ్చేది ఎప్పుడని సీఎం జగన్‌ను టీడీపీ సీనియర్ నేత, మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు ఇచ్చేది ఎప్పుడని సీఎం జగన్‌ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. పేదల ఇంటి విషయంలో ప్రజలను జగన్ సర్కారు మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. శ్రావణమాసంలో పేదలకు టిడ్కో ఇల్లు ఇస్తామని అన్నారని, అది ఏమైందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అంటున్నారు, ఆ ఆస్తులను అమ్మేదిఎప్పుడు, పేదలకు ఇళ్లు ఇచ్చేది ఎప్పుడని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జగన్ అబద్ధాల కోరని, జగన్‌వి సన్నాసి కబుర్లు అని, రివర్స్ సీఎం అని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల నిధులు దారి మళ్లిస్తున్నా మంత్రి బొత్స ఎందుకు మాట్లాడరని బండారు సత్యనారాయణ మూర్తి  నిలదీశారు. 

Updated Date - 2021-08-24T00:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising