రైతుల పరిస్థితి దయనీయం
ABN, First Publish Date - 2021-06-20T05:54:20+05:30
ప్రభుత్వ వైఖరి వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి ఆరోపించారు.
తాడేపల్లిగూడెం రూరల్, జూన్ 19: ప్రభుత్వ వైఖరి వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి ఆరోపించారు. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు ధర్నాకు బయల్దేరే వాహ నాలను ఆయన శనివారం తన కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల పంటలు అమ్ము కుని రెండు నెలలు అయినా నేటికి సొమ్ములు అందక తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. నరసాపురం తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, కార్యదర్శి వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ మర్లపాటి నాగేశ్వరరావు, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు పీతల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-20T05:54:20+05:30 IST