ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై చర్చకు ‘నో’

ABN, First Publish Date - 2021-12-01T06:25:55+05:30

కౌన్సిల్‌ సమావేశంలో అజెండాలోని అంశాలే కాక ప్రజా సమస్యలను చర్చించాలని కౌన్సిలర్‌ కారింకి నాగేశ్వరరావు అన్నారు.

కింద కూర్చుని నిరసన తెలియజేస్తున్న కారింకి నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజెండాలోని అంశాలే చర్చించాలన్న మునిసిపల్‌ చైర్మన్‌

టీడీపీ కౌన్సిలర్‌ కారింకి  నిరసన ఫ నేలపై బైఠాయింపు

నిడదవోలు, నవంబరు 30: కౌన్సిల్‌ సమావేశంలో అజెండాలోని అంశాలే కాక  ప్రజా సమస్యలను చర్చించాలని కౌన్సిలర్‌ కారింకి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం నిడదవోలు మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం అజెండాలోని అంశాలు మాత్రమే చర్చించాలనడంతో దీనిని వ్యతిరేకించిన టీడీపీ కౌన్సిలర్‌ కారింకి నాగేశ్వరరావు నల్లా చొక్కా ధరించి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. సమావేశానికి ముందు మున్సిపల్‌ చైర్మన్‌ ఆదినారాయణ మాట్లాడుతూ నిడదవోలు పుర పాలక సంఘానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో  5వ స్థానం రావడానికి మున్సిపల్‌ అధికార్లు, పారిశుధ్య కార్మికులతో పాటుగా పట్టణ ప్రజల సహకారం వల్లే సాధ్యమైందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది మరింత మంచి ర్యాంకు వచ్చేలా అందరూ కృషి చేయాలన్నారు.   వైస్‌ చైర్మన్లు యలగాడ బాలరాజు, వెంకట లక్ష్మి, కౌన్సిల ర్లు పువ్వల రతీదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ పద్మావతి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T06:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising