వ్యాక్సిన్ వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి
ABN, First Publish Date - 2021-05-09T06:38:21+05:30
ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసి వారి ప్రాణాలు కాపాడాలని భీమవరం టీడీపీ నాయకులు ఇళ్ళ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు.
భీమవరం, నరసాపురంలలో టీడీపీ నాయకుల నిరసన
భీమవరం అర్బన్, మే 8 : ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసి వారి ప్రాణాలు కాపాడాలని భీమవరం టీడీపీ నాయకులు ఇళ్ళ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నరసాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ వ్యాక్సిన్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యానికి రాష్ట్రంలో ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారథి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరావు, పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్: కరోనా వ్యాక్సిన్ అందరికి అందించాలంటూ టీడీపీ అధ్వర్యంలో శనివారం ప్ల కార్డులతో డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ పొత్తూరి రామరాజు నివాసంలో నిరసన తెలిపారు. ప్రజలు వ్యాక్సిన్ కోసం పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాష్ట్రమే కొనుగోలు చేసి ప్రతి ఒక్కరికి టీకా వేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు కొప్పాడ రవి, కొల్లు పెద్దిరాజు, జక్కం శ్రీమన్నారాయణ, షేక్ హుసేన్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-09T06:38:21+05:30 IST