ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-06-24T04:39:25+05:30

పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యమని, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది మెరుగైన సేవలందించాలని డీఎల్‌పీవో ఎం.బాలామణి అన్నారు.

స్వచ్ఛ సంకల్పం సమీక్షలో మాట్లాడుతున్న డీఎల్‌పీవో బాలామణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం, జూన్‌ 23: పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యమని, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది మెరుగైన సేవలందించాలని డీఎల్‌పీవో ఎం.బాలామణి అన్నారు. వెలుగు కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై బుధవారం సమీ క్షించారు. నెల రోజులపాటు జరిగే కార్యక్రమంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ముందుగా చెత్తను సేకరించడానికి వాహనాలను సమకూర్చు కోవాలని, ప్రజల్లో చెత్త సేకరణపై అవగాహన కల్పించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జరిగేలా అధికా రులు, కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ కె.జ్యోతి, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising