ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం: బొలిశెట్టి

ABN, First Publish Date - 2021-10-29T04:55:37+05:30

విశాఖ ఉక్కును పరిరక్షించుకు ందామని జనసేన తాడేపల్లిగూడెం నియోజ కవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

నినాదాలు చేస్తున్న జనసేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తాడేపల్లిగూడెం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కును పరిరక్షించుకు ందామని జనసేన తాడేపల్లిగూడెం నియోజ కవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. విశాఖ  ఉక్కు పరిరక్షణకోసం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈనెల 31న గాజువాకలో నిర్వహించే బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నుంచి అధిక సంఖ్యలో జనసైనికులు తరలివెళ్లనున్నట్టు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకోసం జనసేన నాయకులు గురువారం నిరసన తెలిపారు.  రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బొలిశెట్టి మండిపడ్డారు. ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు పరిరక్షణను రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అభివృద్ధిని, యువతకు ఉపాధి మార్గాలను పక్కనపెట్టి అప్పులతో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తూర్పారబట్టారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణ మూర్తి, యంట్రపాటి రాజు, చాపల రమేష్‌, మైలవరపు రాజేంద్ర ప్రసాద్‌, మాదాసు ఇందు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T04:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising