జలాశయం భూముల్లో మట్టి తవ్వకాలు
ABN, First Publish Date - 2021-07-30T04:52:59+05:30
కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం భూముల్లో యంత్రాలతో మట్టి తవ్వి రవాణా చేస్తున్నా ఇరిగేషన్ అధికారు లు చోద్యం చూస్తున్నారని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులు తలారి ప్రకాష్ విమర్శించారు.
జంగారెడ్డిగూడెం, జూలై 29 : కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం భూముల్లో యంత్రాలతో మట్టి తవ్వి రవాణా చేస్తున్నా ఇరిగేషన్ అధికారు లు చోద్యం చూస్తున్నారని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులు తలారి ప్రకాష్ విమర్శించారు. ప్రాజెక్ట్ భూముల్లో యంత్రాలతో మట్టిని తవ్వుతున్న సమయంలో గురువారం న్యూడెమోక్రసీ నాయకులు అడ్డుకున్నారు. ఎక్స్క వేటర్కు అడ్డంగా పడుకుని తవ్వకాలను ఆపాలని నిరసన వ్యక్తం చేశారు. తలారి ప్రకాష్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న విషయాన్ని పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు తెలిపిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ముంపు భూములను మెరకచేసి అక్రమంగా సాగు చేస్తున్నారని ఆరోపించారు. కలింపూడి సుందరరావు, చాబ త్తుల రవి, ఏసు, జువ్వాల వెంకటేశ్వరరావు, రాంబాబు, పాల్గొన్నారు.
Updated Date - 2021-07-30T04:52:59+05:30 IST