ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలి.. వాన.. రైతుకు నష్టం

ABN, First Publish Date - 2021-04-16T06:26:09+05:30

మండలంలో గురువారం తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

రేచర్లలో నేలనంటిన పామాయిల్‌ చెట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపూడి, ఏప్రిల్‌ 15: మండలంలో గురువారం తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రేచర్ల గ్రామంలో సుడిగాలితో చెలికాని రామకృష్ణ, దుర్గారావు పామాయిల్‌ తోటల్లో సుమారు 20 చెట్లు విరిగిపడిపోయాయి. మొక్కజొన్న చేలు గాలికి ఒరిగిపోయాయి. బాలా వారి గూడెం మామిడితోటల్లో మామిడి రాలిపోయింది. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభా లు విరిగిపడిపోవడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. సాయంత్రానికి అధికారులు సరఫరా పునరుద్ధరించారు.


నేలకొరిగిన మొక్కజొన్న

పోలవరం: మండలంలో వెంకటాపురం, పట్టిసీమ, బంగారమ్మపేట, గుటాల గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. కోతకు వచ్చిన పంట గాలి దుమ్ముకు నేలకొరగడంతో రైతులు ఆందోళనతో ఉన్నారు. ముందుగానే ఎక్కడిక్కడ పంటను కోసి ఆరబెట్టారు. బుధవారం వర్షంతో పాటు గురు వారం కూడా వాతావరణంలో మబ్బులు కమ్ముకుని ఉండడంతో పంట  ఎక్కడ నష్టపోతామోనని రైతులు అదనపు కులీలను వినియోగించి పంట కోసి అమ్ముకున్నారు. ఎకరాకు రూ.4వేలు వెచ్చించి పంటను తెగనమ్ము కోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-04-16T06:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising