మల్లికార్జునస్వామికి లక్ష బిల్వార్చన
ABN, First Publish Date - 2021-10-25T04:43:42+05:30
భ్రమరాంబ సమేత ఉద్దండ మల్లికార్జున స్వామికి లక్ష భిల్వార్చన నిర్వహించారు.
కొవ్వూరు, అక్టోబరు 24: భ్రమరాంబ సమేత ఉద్దండ మల్లికార్జున స్వామికి లక్ష భిల్వార్చన నిర్వహించారు. దొమ్మేరులో భ్రమరాంబ సమేత ఉద్దండ మల్లికార్జునస్వామికి ఆదివారం ఆశ్వయుజ మాస పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శివకోటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో గణపతి పూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, రుద్రహోమం, భ్రమరాంబ దేవికి మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని, స్వామి వారిని విశేష అలంకరణ చేసి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించాౄరు. కార్యక్రమంలో వై.శివతేజ, వైవీఎస్ కామేశ్వరరావు, మేడూరి సుబ్రమణ్యశర్మ, వెంపరాల హరగోపాల్, లంక రాధాకృష్ణ, దశిక పవన్, వైవీవీ సత్యనారాయణమూర్తి, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-25T04:43:42+05:30 IST