పీటీడీని లాభాల బాటలో నడిపిస్తా..
ABN, First Publish Date - 2021-10-30T05:27:56+05:30
రాష్ట్ర ప్రజా రవాణా శాఖను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని ఆ సంస్థ జోనల్ చైర్పర్సన్ తాతినేని పద్మా వతి అన్నారు.
ఏలూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజా రవాణా శాఖను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని ఆ సంస్థ జోనల్ చైర్పర్సన్ తాతినేని పద్మా వతి అన్నారు. ఏలూరులోని రీజనల్ మేనేజర్ కార్యాలయంలో ఆమె శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆర్టీసీ తిరిగి పుంజు కోవడానికి కృషి చేస్తానన్నారు. చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఏలూరు వచ్చిన ఆమె ముందుగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రీజనల్ మేనేజర్ వీరయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:27:56+05:30 IST