అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయాలి
ABN, First Publish Date - 2021-01-27T04:46:35+05:30
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలు చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ మోహన్ అన్నారు.
పాలకొల్లు టౌన్, జనవరి 26 : అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలు చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ మోహన్ అన్నారు. గాంధీ బొమ్మల సెంటర్లో మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం పాటించారు. ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర మాట్లాడుతూ మూడు రాజధానుల పేరుతో ప్రజలను ప్రాంతాలు, కులాలు, మతాలతో విభజించడం, శాసనమండలి రద్దు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగించడం, ప్రతిపక్షాలపై కేసులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలపై దాడులు, హత్యలు, మహిళలపై అత్యాచా రాలు, దేవాలయాలపై దాడులు వంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు జగన్ ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి కావలసింది రాజారెడ్డి రాజ్యాంగం కాద ని, అంబేడ్కర్ రాజ్యాగం కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ప్రభుత్వా నికి చరమ గీతం పాడాలని వారు ఈసందర్భంగా పిలుపునిచ్చారు. పెచ్చెట్టి బాబు, కె.గౌరునాయుడు, కోడి విజయభాస్కర్, చిట్టూరి ఆంజనేయులు, గొట్టుముక్కల సూ ర్యనారాయణ రాజు, ద్రాక్షారపు జ్యోతి, ఎస్తేరు రాణి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-27T04:46:35+05:30 IST