ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయలు కొనేందుకు వెళుతూ..

ABN, First Publish Date - 2021-07-30T04:52:00+05:30

కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళుతున్న ఓ వ్యక్తి మార్గమధ్యలోనే మృతి చెందాడు.

చినబాబు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు బైక్‌లు ఢీ :  పల్లంట్ల వాసి మృతి 

దేవరపల్లి, జూలై 29: కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళుతున్న ఓ వ్యక్తి మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసుల వివరాలివి.. పల్లంట్లకు చెందిన నూతలపాటి చినబాబు (30) బైక్‌పై దేవరపల్లి వెళుతుండ గా చాగల్లు మండలం చిక్కాలకు చెందిన ఇళ్ల రామకృష్ణ దే వరపల్లి నుంచి బైక్‌పై చిక్కాల వస్తుండగా ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనా లు ఢీకొన్నాయి. ప్రమాదంలో చినబాబు తలకు తీవ్రగాయమైంది. దేవరపల్లి పీహెచ్‌సీకి తరలించగా వైద్యాధికారులు పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. రామకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ కూలీగా పని చేస్తున్న చినబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీడీపీ కార్యకర్తగా పనిచేయడంతో పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Updated Date - 2021-07-30T04:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising