మహనీయుల ఆశయసాధన కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే బాలరాజు
ABN, First Publish Date - 2021-08-16T01:05:45+05:30
మహనీయుల ఆశయసాధన కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే బాలరాజు
జంగారెడ్డిగూడెం: 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బుట్టాయిగూడెం మండలం తెల్లంవారిగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, తెల్లంవారి గూడెం సచివాలయం, దొరమామిడి సచివాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్యం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. ఆ మహనీయుల ఆశయసాధ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య పాలన సీఎం జగన్ సాగిస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ ఎనలేని కృషి చేస్తున్నారని బాలరాజు పేర్కొన్నారు.
Updated Date - 2021-08-16T01:05:45+05:30 IST