మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2021-12-08T05:08:38+05:30
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి కె.బుచ్చిబాబు డిమాండ్ చేశారు.
టి.నరసాపురం, డిసెంబరు 7: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి కె.బుచ్చిబాబు డిమాండ్ చేశారు. ఎంఈవో టి.రామూర్తికి మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. భోజన పధకం కార్మికులకు నాలుగు నెలలుగా బిల్లు చెల్లించడం లేదన్నారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.15 చొప్పున మెస్ చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జె.మంగమ్మ, పావని, జగదాంబ, రమణ, సావిత్రి, సుశీల పాల్గొన్నారు.
Updated Date - 2021-12-08T05:08:38+05:30 IST