భాషా సంస్కృతిని కాపాడుకోవాలి
ABN, First Publish Date - 2021-01-27T04:44:50+05:30
భాషా సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు.
నరసాపురం, జనవరి 26: భాషా సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. మాజీ మంత్రి అ ల్లూరి సత్యనారాయణరాజు వర్ధంతి సభలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అల్లూరి జీవిత చరిత్ర పుస్తకాన్ని అవిష్కరించారు. తెలుగు భాషను ప్రాథమిక స్థా యి నుంచి డిగ్రీ వరకు ఒక సబ్జెక్ట్గా ఉంచాలన్నారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టు బడిన వ్యక్తి అల్లూరి సత్యనారాయణరాజు అన్నారు. అయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, ఏఎం.సూర్యనారాయణ, బాబుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-27T04:44:50+05:30 IST